బీజేపీలో చేరితే బెదిరింపులా..? : రఘునందన్​రావు 

బీజేపీలో చేరితే బెదిరింపులా..? : రఘునందన్​రావు 

దుబ్బాక, వెలుగు: బీజేపీలో చేరితే బెదిరించడమేంటని మంత్రి హరీశ్​రావుని  ప్రశ్నించారు ఎమ్మెల్యే  మాదవనేని రఘునందన్​రావు. శనివారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీసులో ఆయన మాట్లాడారు. బీజేపీలో చేరే కుటుంబాలకు బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు, రేషన్​ కార్డు రాదని బీఆర్​ఎస్​ నాయకులు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండించారు.  మంత్రి హరీశ్​రావు ఎక్కడ మీటింగ్​ పెట్టినా బీజేపోడు వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతారని అబద్ధ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  

దుబ్బాక, హుజురాబాద్​, మునుగోడు ఉప ఎన్నికలు జరిగి మూడేళ్లైనా రాష్ట్రంలో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టారో నిరూపించాలని మంత్రికి సవాల్​ విసిరారు. అనంతరం ఎనగుర్తి గ్రామానికి చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. కార్యక్రమంలో అంబటి బాలేశ్​గౌడ్​, శుభాష్​రెడ్డి, వీభిషన్​ రెడ్డి, మంద అనిల్​ రెడ్డి, అరిగె కృష్ణ, మచ్చ శ్రీనివాస్​, పుట్ట వంశీ, గాజుల భాస్కర్​, సుంకు ప్రవీణ్​, మాదవనేని భాను పాల్గొన్నారు.